సికింద్రాబాద్‌లో నర్సుల ఆందోళన

Monday, 4 April 2016

(4 Apr) హైదరాబాద్‌ : శిక్షణ పేరుతో అధికారులు తమపై పని ఒత్తిడి పెంచుతున్నారని ఎఎన్‌ఎం నర్సులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన నర్సులు సికింద్రాబాద్‌లోని డీఎంయూ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మిషన్‌ ఇంద్ర ధనస్సు శిక్షణ పేరుతో తీసుకువచ్చి బలవంతంగా ఇంటింటి సర్వే చేయిస్తున్నారని వారు ఆరోపించారు. చంటి పిల్లలతో ఇంటింటికి తిరగలేకపోతున్నామని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు.

www.telangananurses.blogspot.com

Email : telangana.medical@gmail.com

 
Share

No comments:

Post a Comment

 
Copyright © 2015 Telangana Nurses
Distributed By Ts Nurses | Design By Telangana Nurses